ఓయూ విద్యార్థులకు గుడ్ న్యూస్… పరీక్షా ఫలితాలు విడుదల..
విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గుడ్ న్యూస్ చెప్పింది. ఓయూ పరిధిలో నిర్వహించిన పలు ఎగ్జామ్స్ రిజల్ట్స్ శుక్రవారం రిలీజ్ చేసినట్టు ఉస్మానియా యూనివర్సటీ పరీక్షల విభాగం ప్రకటించింది. అయితే కరోనా సంక్షోభ పరిస్థితుల వల్ల లాక్డౌన్ విధించడంతో ఓయూ పరిధిలో నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ చాలావరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ కంటే ముందే నిర్వహించిన కొన్ని ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. కానీ కరోనా వీరవిహారం వల్ల అది సాధ్యపడలేదు. ఇటీవల లాక్డౌన్ […]
విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గుడ్ న్యూస్ చెప్పింది. ఓయూ పరిధిలో నిర్వహించిన పలు ఎగ్జామ్స్ రిజల్ట్స్ శుక్రవారం రిలీజ్ చేసినట్టు ఉస్మానియా యూనివర్సటీ పరీక్షల విభాగం ప్రకటించింది. అయితే కరోనా సంక్షోభ పరిస్థితుల వల్ల లాక్డౌన్ విధించడంతో ఓయూ పరిధిలో నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ చాలావరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ కంటే ముందే నిర్వహించిన కొన్ని ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. కానీ కరోనా వీరవిహారం వల్ల అది సాధ్యపడలేదు.
ఇటీవల లాక్డౌన్ నిబంధనల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం బీఈడీకి సంబంధించిన రిజల్ట్స్ శుక్రవారం విడుదల చేసింది. విడుదల చేసిన వాటిలో… బీఈడీ(ఇంటలెక్చువల్ డిజబిలిటీ), బీఈడీ(లెర్నింగ్ డిజబిలిటీ), బీఈడీ(హియరింగ్ ఇంపైర్డ్) కోర్సులకు సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలను ప్రకటించారు. ఫలితాలను www.osmania.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చు.