‘ఆహా’లో ‘ఒరేయ్ బుజ్జిగా’, రిలీజ్ ఎప్పుడంటే?
థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఒకవేళ చేసినా ప్రేక్షకులు వస్తారో, రారో తెలియదు. అందుకే టాలీవుడ్ లో బడ్జెట్ తో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాాయి.
థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఒకవేళ చేసినా ప్రేక్షకులు వస్తారో, రారో తెలియదు. అందుకే టాలీవుడ్ లో బడ్జెట్ తో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా యువ హీరో రాజ్ తరుణ్ కూడా ఓటీటీ ద్వారా ఆడియెన్స్ ను పలుకరించేందుకు రెడీ అయ్యాడు. రాజ్ తరుణ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో రెడీ అయ్యాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో ఆకట్టుకకున్న విజయ్ కుమార్ కొండ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు.
ఎప్పటినుంచో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు అనుకూలతలు కనిపించడం లేదు. అందుకే ‘ఆహా’ ఓటీటీలో తీసుకురానున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు.
Also Read :