టీటీడీ గుడ్ న్యూస్.. వారికి 90 రోజుల్లోపు ఎప్పుడైనా ఉచిత దర్శనం.!
భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ అందించింది. ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనేవారికి శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్ కల్పించింది. వారు టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోపు...
Srivari Kalyanotsavam: భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ అందించింది. ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనేవారికి శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్ కల్పించింది. వారు టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోపు ఎప్పుడైనా కూడా సుపథం ప్రవేశమార్గం నుంచి ఉచితంగా శ్రీవారిని దర్శించుకోవచ్చునని తెలిపింది. ఈ అవకాశాన్ని భక్తులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
కాగా, కరోనా నేపథ్యంలో టీటీడీ ఏర్పాటు చేసిన ఆన్లైన్ కల్యాణోత్సవ సేవలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 7వ తేదీన ఈ సేవలను మొదలుపెట్టగా.. అప్పటి నుంచి ఈ నెల 7 వరకు దాదాపుగా 8,330 టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవ సేవలు ప్రారంభమవుతాయి.
Also Read:
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..