నువ్వు ఉండి ఉంటే ప్యాంట్ తడుపుకునే వాడివి.. కార్టునిస్ట్ కామెంట్స్పై విరుచుకుపడిన ఖుష్బూ
బీజేపీ నేత ఖుష్బూ రోడ్డు ప్రమాదంపై తమిళనాట ఫుల్ కాంట్రవర్సీ మొదలైంది. యాక్సిడెంట్ ఫోటోలపై ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఈ యాక్సిడెంట్.. డ్రామా అని ఓ ప్రముఖుడు అంటే.. దమ్ముంటే ప్రూవ్ చేయమంటూ ఖుష్బూ కౌంటర్ ఇచ్చింది.
బీజేపీ నేత ఖుష్బూ రోడ్డు ప్రమాదంపై తమిళనాట ఫుల్ కాంట్రవర్సీ మొదలైంది. యాక్సిడెంట్ ఫోటోలపై ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఈ యాక్సిడెంట్.. డ్రామా అని ఓ ప్రముఖుడు అంటే.. దమ్ముంటే ప్రూవ్ చేయమంటూ ఖుష్బూ కౌంటర్ ఇచ్చింది. ఓ రేంజ్లో ఘాటైన పదాలతో ఫైర్ బ్రాండ్ నేత ఖుష్బూ సవాల్ విసిరింది.
రెండు రోజుల క్రితం ఖుష్బూ కారును ఓ కంటైనర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో కుష్బూ సేఫ్గా బయటపడ్డారు. తనపై హత్యా ప్రయత్నం జరిగిందంటూ యాక్సిడెంట్ ఫోటోలు ఫేర్ చేశారు ఖుష్బూ. అయితే ప్రమాదం జరిగిన తర్వాత తీసిన ఫోటోలే ఇప్పుడు కాంట్రవర్సీకి కారణంగా మారుతున్నాయి.
ఖుష్బూకు యాక్సిడెంట్ జరగలేదని.. అంతా డ్రామా అంటూ తమిళ కార్టునిస్ట్ బాలా ఓ ట్వీట్ను రీట్వీట్ చేశారు. యాక్సిడెంట్ ఫోటోలో ముందు సీట్లో.. వెనక సీట్లో రెండింటిలోనూ ఖుష్బూనే ఉందని.. అదెలా సాధ్యమంటూ బాలా ప్రశ్నించాడు. కార్టునిస్ట్ బాలా రీట్వీట్పై ఖుష్యూ తీవ్ర స్థాయిలో స్పందించారు. రోడ్డు యాక్సిడెంట్ సమయంలో నువ్వు ఉండి ఉంటే ప్యాంట్ తడుపుకునే వాడివంటూ బాలాపై పదునైన మాటలతో ఖుష్బూ విరుచుకుపడ్డారు.
ఆ ఫోటోల్లో ఏముంది…
నిజానికి ఖుష్బూ షేర్ చేసిన యాక్సిడెంట్ ఫోటోలు రియల్వే. అవి ఫేక్ కాదు. కాకపోతే.. చిన్న కన్ఫూజన్. యాక్సిడెంట్ జరిగిన కారులో వెనుకు సీట్లో కూర్చున్నది ఖుష్బూ అసిస్టెంట్. ముందు సీట్లో ఉంది మాత్రం ఖుష్బూనే. ఆ ఫోటోనే బీజేపీ నేత ఖుష్బూ ట్విట్టర్లో షేర్ చేశారు.
ఆ ట్వీట్లో ఆమె ఎక్కడా తాను వెనక సీట్లో ఉన్నట్టు చెప్పలేదు. అయితే.. కార్టునిస్టు బాలా మాత్రం ఆ రెండు ఫోటోల్లో ఉన్నది ఖుష్బూనే అంటూ.. అది ఫేక్ ఫోటోలు అని కామెంట్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేయడంతో ఖుష్బూకు కోపం కట్టలు తెంచుకుంది. అందుకే.. నువ్వు ఉండి ఉంటే ప్యాంట్ తడుపుకునే వాడివంటూ ఘాటైన వ్యాఖ్యలతో సీరియస్గా రియాక్ట్ అయింది బీజేపీ నేత ఖుష్బూ.