ఇవాళ కరోనా పుట్టినరోజు.. సరిగ్గా ఏడాది క్రితం మొదటి కేసు ఎక్కడ నమోదైందంటే
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మొదటి కేసు నమోదై.. ఇవాళ్టికి ఏడాది పూర్తైంది. నిజానికి చెప్పాలంటే ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
Corona First Case found: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మొదటి కేసు నమోదై.. ఇవాళ్టికి ఏడాది పూర్తైంది. నిజానికి చెప్పాలంటే ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ చైనాలోనే మొదట ఈ వైరస్ బయటపడగా.. హాంకాంగ్ పత్రిక వివరాల ప్రకారం.. 2019 నవంబర్ 17న హుబీ ప్రావిన్స్కి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్టమొదట కరోనా గుర్తించినట్లు తెలుస్తోంది. వైరస్ గుర్తించిన తొలి రోజుల్లో రోజుకు ఐదు కేసులు నమోదు కాగా.. ఆ తరువాత రోజురోజుకు సంఖ్య పెరుగుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలకు విస్తరించింది.
దీంతో లక్షలమంది జీవితాలను కరోనా చిన్నాభిన్నం కాగా.. కరోనా వలన అన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ వైరస్ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ.. వైరస్ కట్టడికి సాధ్యపడలేదు. వైరస్పై ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడానికి తోడు వారి నిర్లక్ష్యమే కేసుల సంఖ్య పెరిగేందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
కాగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 55,389,375మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 38,529,424 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,333,019 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15,526,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఏడాది అవుతున్నా ఈ వైరస్కి వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.