లోయలో కొనసాగుతున్న ఉగ్రవేట.. అవంతిపురాలో ఎన్‌కౌంటర్..

జమ్ముకశ్మీర్ లోయలో ఉగ్రవేట ఇంకా కొనసాగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం అవంతిపురా ట్రాల్ ప్రాంతంలోని చేవా ఉలర్ గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

లోయలో కొనసాగుతున్న ఉగ్రవేట.. అవంతిపురాలో ఎన్‌కౌంటర్..
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2020 | 11:05 AM

జమ్ముకశ్మీర్ లోయలో ఉగ్రవేట ఇంకా కొనసాగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం అవంతిపురా ట్రాల్ ప్రాంతంలోని చేవా ఉలర్ గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందండంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి గురువారం రాత్రి నుంచి కార్డెన్ సర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో వీరిని చూసిన ఉగ్రవాదులు.. కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమై భద్రతా బలగాలు.. ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. కాగా, గురువారం సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.