బ్రేకింగ్: జేసీకి మరో షాక్..
మరోసారి జేసీ ట్రావెల్స్కు సంబంధించిన వాహనాలు సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు. బీస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో.. వెహికల్స్ని సీజ్ చేశారు అధికారులు. వీటిని నాగాలాండ్తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమంగా...
మరోసారి టీడీపీ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్కు సంబంధించిన వాహనాలను సీజ్ చేశారు ఏపీ రవాణా శాఖ అధికారులు. బీస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో.. వెహికల్స్ని సీజ్ చేశారు అధికారులు. వీటిని నాగాలాండ్తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించారు. కాగా గతంలో కూడా 57 వెహికల్స్ని అధికారులు సీజ్ చేశారు. తాజాగా ఇవాళ మరో 4 టిప్పర్లను సీజ్ చేశారు రవాణాశాఖ అధికారులు. అంతేకాకుండా ఇంకా మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామని డీటీసీ శివరామ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా దీనిపై టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
షాకింగ్ న్యూస్: కన్న కూతుర్నే నరబలి ఇచ్చిన దుర్మార్గపు తండ్రి
ప్రముఖ రచయిత జొన్న విత్తులపై ఎస్సీ, ఎస్టీ కేసు..