బ్రేకింగ్: గోదావరిలో మరో బోటు బోల్తా..!

గోదావరి నదిలో మరో బోటు బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఇటీవలే జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా.. ఓ బోటు బోల్తా పడింది. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గోదావరిలో ఉధృతి పెరగడంతో.. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు.. ఒక్కసారిగా బోల్తాపడింది. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.. సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో.. అక్కడున్నవారందరూ […]

బ్రేకింగ్: గోదావరిలో మరో బోటు బోల్తా..!
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 5:41 PM

గోదావరి నదిలో మరో బోటు బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఇటీవలే జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా.. ఓ బోటు బోల్తా పడింది. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గోదావరిలో ఉధృతి పెరగడంతో.. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు.. ఒక్కసారిగా బోల్తాపడింది. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.. సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో.. అక్కడున్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 15న ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా పడిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో.. 27 మంది ప్రాణాలతో బయటకు రాగా.. మిగిలిన వారు జలసమాధి అయ్యారు. వారి కోసమే.. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ గాలింపు చర్యలు చేపడుతోన్న సమయంలో.. ఇలా బోటు ప్రమాదానికి గురైంది.