ఆఫ్ఘనిస్థాన్లోని కపిసా ప్రావిన్స్లో రాకెట్ దాడి
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఇటీవల ప్రభుత్వంతో ఖైదీల విడుదలకు సంబంధించి చర్యలు..
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఇటీవల ప్రభుత్వంతో ఖైదీల విడుదలకు సంబంధించి చర్యలు సఫలమైనప్పటికీ.. తాలిబన్లు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా కపిసా ప్రావిన్స్లోని అల్ సై జిల్లాలో రాకెట్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ సామన్యుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని కపిసా పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుందని.. ఆఫ్ఘన్ భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య బఝార్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు.
A civilian was killed & 3 others injured when a rocket hit a house in Al-Sai district of Kapisa province. Kapisa police spokesman Shaykh Shurash said the incident took place last night during clashes b/w govt forces & Taliban in Bazaar area of the district: Afghanistan’s TOLOnews
— ANI (@ANI) August 21, 2020
Read More :