శుభకార్యానికి వెళ్ళొస్తున్నారు.. అంతలోనే ఘోరం !!

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో అయిదు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మామిడూరు గ్రామానికి చెందిన చరుమూరి రామస్వామి కుటుంబం కారులో పెద్దాపురంలో జరిగిని ఓ శుభకార్యానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం రావులపాలెం వైపు వస్తుండగా.. మడికి పెట్రోల్ బంక్‌ వద్ద ఆగివున్న లారీని ఢీ […]

శుభకార్యానికి వెళ్ళొస్తున్నారు.. అంతలోనే ఘోరం !!
Follow us

| Edited By:

Updated on: Oct 03, 2019 | 10:13 AM

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో అయిదు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మామిడూరు గ్రామానికి చెందిన చరుమూరి రామస్వామి కుటుంబం కారులో పెద్దాపురంలో జరిగిని ఓ శుభకార్యానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం రావులపాలెం వైపు వస్తుండగా.. మడికి పెట్రోల్ బంక్‌ వద్ద ఆగివున్న లారీని ఢీ కొట్టడంతో.. కారులో ఉన్న ఒకరు మృతి చెందగా.. మరో అయిదుగురు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.