బ్రేకింగ్.. మరోసారి కాల్పులకు దిగిన నేపాల్.. ఒకరికి గాయాలు..
నేపాల్ మరోసారి రెచ్చిపోయింది. బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లా సరిహద్దులో శనివారం రాత్రి కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఓ భారత పౌరుడు గాయపడ్డాడు. మరో ఇద్దరు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన.. తేర్హాగచ్..
నేపాల్ మరోసారి రెచ్చిపోయింది. బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లా సరిహద్దులో శనివారం రాత్రి కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఓ భారత పౌరుడు గాయపడ్డాడు. మరో ఇద్దరు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన.. తేర్హాగచ్ బ్లాక్లోని ఫతేపూర్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక సరిహద్దు గ్రామానికి చెందిన ఓ ముగ్గురు వ్యక్తులు వారి పశువులు తప్పిపోవడంతో.. సరిహద్దు ప్రాంతంలో వెతుకుతున్నారు. ఈ క్రమంలో నేపాల్ పోలీసులు.. భారత పౌరులపై కాల్పులకు దిగారు. దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని అక్కడి నుంచి వెంటనే పూర్నియా జిల్లాలోని స్థానిక ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని కిషన్ గంజ్ ఎస్పీ తెలిపారు. ఘటనపై నేపాల్ పోలీసులతో కిషన్ గంజ్ ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామన్నారు. కాగా, గత నెలలో కూడా నేపాల్ ఇలానే కాల్పులకు దిగడంతో ఓ వ్యక్తి మరణించారు.
One Indian injured after Nepal Police shot at three Indian men near India-Nepal border in Kishanganj. Injured shifted to hospital. Investigation underway: SP Kishanganj, Bihar pic.twitter.com/0eGnJyo1gd
— ANI (@ANI) July 19, 2020