షాకింగ్: ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా ముప్పు.. నిపుణుల రిపోర్ట్

ప్రపంచంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడే ఛాన్స్ ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 170 కోట్ల మంది ప్రజలకు కరోనా ముప్పు తప్పదని అంటున్నారు నిపుణులు. లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు...

షాకింగ్: ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా ముప్పు.. నిపుణుల రిపోర్ట్
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 10:23 AM

ప్రపంచంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడే ఛాన్స్ ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 170 కోట్ల మంది ప్రజలకు కరోనా ముప్పు తప్పదని అంటున్నారు నిపుణులు. లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన నివేదికని.. ప్రఖ్యాత లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మ్యాగజైన్ ప్రచురించింది. అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో 22 శాతం మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం అత్యధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస కోశ వ్యాధులు, టైప్ 2 డయాబెటీస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా ముప్పు ఎక్కువని అంటున్నారు నిపుణులు. ఈ వ్యాధుల్లో ఏ ఒక్కటి ఉన్నా వారికి.. కోవిడ్ సోకితే చాలా ప్రమాదంలో పడతారని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్లోబల్ ఆఫ్ డిసీజెస్, వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన గణాంకాల్ని విశ్లేషించి ఎంత మంది ఈ వైరస్ బారిన పడతారో శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు.

కాగా ప్రపంచ జనాభాలో 34.9 కోట్ల మంది అంటే నాలుగు శాతానికి పైగా జనాభాకి వైరస్ సోకితే ఆస్పత్రిలో చేర్చించాల్సిన అవసరం ఉందని లాన్సెట్ పేర్కొంది. ఇక 20 ఏళ్ల లోపు ఉన్నవారు 5 శాతం, 70 ఏళ్లకు పై బడిన వారు 66 శాతం మంది ఉన్నారు. పురుషుల్లో 6 శాతం మంది, మహిళల్లో 3 శాతం మందికి ముప్పు అధికంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం మరింతగా కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా మంగళవారం 141377 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 82,50,004కి చేరాయి. అలాగే నిన్న 4379 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 4,45,174కి చేరింది. ఇక ప్రస్తుతం 3505670 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 4299200గా ఉంది.

Read More: 

డిప్రెషన్‌కూ ‘ఇన్సూరెన్స్’.. సుప్రీం నోటీసులు

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి