వంద రోజుల తర్వాత దర్శనమిచ్చిన కాళీమాత
కరోనా కల్లోలానికి ఆలయాలు మూతపడ్డాయి. భక్తుల దర్శనాలను రద్దు చేసి.. ప్రతినిత్యం కైంకర్యాలకే పరిమితమైన దేవాలయాలు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. తాజాగా కోల్ కతాలోని ప్రముఖ కాళీ ఘాట్ టెంపుల్ దాదాపు 100 రోజుల అనంతరం తెరుచుకుంది.
కరోనా కల్లోలానికి ఆలయాలు మూతపడ్డాయి. భక్తుల దర్శనాలను రద్దు చేసి.. ప్రతినిత్యం కైంకర్యాలకే పరిమితమైన దేవాలయాలు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. తాజాగా కోల్ కతాలోని ప్రముఖ కాళీ ఘాట్ టెంపుల్ దాదాపు 100 రోజుల అనంతరం తెరుచుకుంది. కరోనా నియంత్రణలో భాగంగా మూతపడ్డ ప్రార్థనా మందిరాలు, జూలై 1 నుంచి మినహాయింపులు ఇవ్వడంతో.. కాళీఘాట్ గుడి భక్తుల దర్శనానికి బెంగాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేవాలయంలోకి ఒక్కసారి 10 మంది భక్తులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. గర్భగుడిలోకి మాత్రం ఎవరినీ వెళ్లనివ్వడం లేదని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అయితే, ఆలయం దర్శన సమయాలను కమిటీ కుదించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం 4 నుంచి 6:30 వరకు మాత్రమే తెరిచి ఉంటుందని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. మాత దర్శనానికి వచ్చే వారు విధిగా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక, ఆలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని శానిటైజ్ చేసిన అనంతరం ప్రవేశం కల్పిస్తున్నారు.