రెండు వర్గాల మధ్య రాళ్లు, కట్టెలతో పరప్పర దాడులు.. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతూ ఒకరు మృతి

ఒకే పార్టీలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. కడప జిల్లా కొండాపురం మండలంలోని పి.అనంతపురంలో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు.

రెండు వర్గాల మధ్య రాళ్లు, కట్టెలతో పరప్పర దాడులు.. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతూ ఒకరు మృతి
Follow us

|

Updated on: Nov 13, 2020 | 2:27 PM

ఒకే పార్టీలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. కడప జిల్లా కొండాపురం మండలంలోని పి.అనంతపురంలో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీలోని ఇరువర్గాల ఘర్షణలో గురునాథ్‌రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గండికోట ముంపు పరిహారం జాబితాలో అనర్హులు ఉన్నారంటూ గురునాథ్‌రెడ్డి గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు మండల స్థాయి గ్రామసభ నిర్వహించారు. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన మరో వర్గం గురునాథ్‌రెడ్డితో గొడవకు దిగింది. దీంతో గురునాథ్‌రెడ్డి వర్గీయులు కూడా వాగ్వివాదానికి దిగారు. రెండు వర్గాల మధ్య మాటలు కాస్త చేతల దాకా వెళ్లింది. దీంతో రెండు గ్రూపులు రాళ్లు, కట్టెలతో పరప్పరం దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన గురునాథ్‌రెడ్డి తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..