ముంబైలో మాత్రమే ఐపీఎల్ నిర్వహిస్తారా..?
ఈ సంవత్సరం ఐపీఎల్ జరిగితే ఒక్క సిటీకే పరిమితం చేయాలని కొందరు బీసీసీఐ సీనియర్ అధికారులు గవర్నింగ్ కౌన్సిల్ వర్గాలకు సూచించారు.
ఈ సంవత్సరం ఐపీఎల్ జరిగితే ఒక్క సిటీకే పరిమితం చేయాలని కొందరు బీసీసీఐ సీనియర్ అధికారులు గవర్నింగ్ కౌన్సిల్ వర్గాలకు సూచించారు. అది కూడా ముంబై అన్నింటికీ సౌకర్యకరంగా ఉంటుందని తెలిపారు. ముంబైలో మూడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాలున్నాయి. వాంఖెడే, డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాలున్నాయి. దీంతోపాటు రిలయెన్స్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్కు కూడా స్పెషల్ గ్రౌండ్ ఉంది. ఇక ఆటగాళ్లు బస చేయడానికి స్టార్ హోటల్స్ కు కొదవలేదు. అయితే ఇది ఇప్పుడు చేసిన సూచన కాదు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి సాధారణంగా ఉన్నపుడు బీసీసీఐ అధికారులు ఈ ప్రపోజల్ తెచ్చారు.
అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముంబై కోవిడ్-19 వ్యాప్తి విషయంలో అత్యంత ప్రమాదకారిగా ఉంది. అక్టోబర్కల్లా అక్కడ పరిస్థితులు అదుపులోకి వస్తే ఒకే వేదికపై ఐపీఎల్ నిర్వహించాలన్న సూచనను జీసీ పరిశీలిస్తుంది.