ట్రిపుల్ ఐటీలో కలకలం.. గర్ల్స్ హాస్టల్ రూమ్‌లో యువకుడు

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐఐటీలో కలకలం రేగింది. విద్యార్థినుల హాస్టల్‌ రూమ్‌లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. అలాగే రోజంతా హాస్టల్ గదిలోనే ఉన్నాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని..

ట్రిపుల్ ఐటీలో కలకలం.. గర్ల్స్ హాస్టల్ రూమ్‌లో యువకుడు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jun 18, 2020 | 1:43 PM

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐఐటీలో కలకలం రేగింది. విద్యార్థినుల హాస్టల్‌ రూమ్‌లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. అలాగే రోజంతా హాస్టల్ గదిలోనే ఉన్నాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు హాస్టల్ అధికారులు. అయితే యువకుడు హాస్టల్ గదిలోకి ప్రవేశించడంపై.. విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా భద్రతా సిబ్బందిపై  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై యూనివర్శిటీ అధికారులు స్పందించారు. లేడీస్ హాస్టల్‌లో అసలేం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. అమ్మాయిల హాస్టల్‌లోకి యువకుడు ఎలా ప్రవేశించాడు అనే దానిపై హాస్టల్‌ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.