దారుణ ఘటన.. పారిపోయిన ప్రేమ జంటని వెతికి తీసుకొచ్చి..
ప్రేమించడం ఆ అమ్మాయి తప్పైంది. గ్రామస్థులంతా చూస్తుండగానే.. ఓ ఊరి పెద్ద ఆ దళిత మైనర్ అమ్మాయిపై దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా చితకబాదాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన.. సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే గుమ్మగట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలోని ఓ మైనర్ బాలిక… సాయి అనే యువకుడితో ప్రేమలో పడింది. వీళ్లిద్దరు పెద్దలకు భయపడి ఊరి నుంచి పారిపోయారు. చివరికి వీరి ఆచూకీ కనిపెట్టిన పెద్దలు.. వాళ్లను ఊరి మధ్యకు పిలిచించి పంచాయతీ […]
ప్రేమించడం ఆ అమ్మాయి తప్పైంది. గ్రామస్థులంతా చూస్తుండగానే.. ఓ ఊరి పెద్ద ఆ దళిత మైనర్ అమ్మాయిపై దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా చితకబాదాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన.. సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే గుమ్మగట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలోని ఓ మైనర్ బాలిక… సాయి అనే యువకుడితో ప్రేమలో పడింది. వీళ్లిద్దరు పెద్దలకు భయపడి ఊరి నుంచి పారిపోయారు. చివరికి వీరి ఆచూకీ కనిపెట్టిన పెద్దలు.. వాళ్లను ఊరి మధ్యకు పిలిచించి పంచాయతీ పెట్టారు. ప్రేమించుకున్నారనే కారణంతో ఇద్దరు మైనర్లను గ్రామస్థుల ముందే గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి తీవ్రంగా కొట్టారు. గ్రామపెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి .. ఆ మైనర్ బాలికపై దాడికి దిగి.. వారిని దారుణంగా కొట్టాడు. కాలితో తన్ని… జుట్టుపట్టుకుని ఈడ్చి పాశవికంగా ప్రవర్తించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సంఘటన జరిగిన రోజు స్పందించని పోలీసులు విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటనపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.