లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా.. ?
లోక్సభ స్పీకర్ ఎన్నికకు కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఎన్డీయే తరపున స్పీకర్ బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజస్థాన్ కోటా నుంచి ఓం బిర్లా లోక్సభకు ఎన్నికయ్యారు. మూడుసార్లు కోటా నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. విద్యార్ధి నేతగా రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. బీజేవైఎం నేతగా పనిచేశారు. అయితే తనకు ఇందుకు సంబంధించి అధికారికంగా సమాచారం అందలేదని ఓం బిర్లా తెలిపారు. కాగా ఓం బిర్లా సతీమణి.. […]
లోక్సభ స్పీకర్ ఎన్నికకు కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఎన్డీయే తరపున స్పీకర్ బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజస్థాన్ కోటా నుంచి ఓం బిర్లా లోక్సభకు ఎన్నికయ్యారు. మూడుసార్లు కోటా నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. విద్యార్ధి నేతగా రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. బీజేవైఎం నేతగా పనిచేశారు. అయితే తనకు ఇందుకు సంబంధించి అధికారికంగా సమాచారం అందలేదని ఓం బిర్లా తెలిపారు. కాగా ఓం బిర్లా సతీమణి.. తన భర్తకు లోక్సభ స్పీకర్ పదవికి ఎంపిక చేయవచ్చునన్న వార్తలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే నిజమైతే.. తనకెంతో గర్వకారణమని తెలిపారు.