ట్రెండ్ సెట్ చేసిన ఓల్డ్ సినిమాలు ఇవే..!
1933 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆదరణ లభిస్తూ.. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తూ వచ్చింది. మొదట నాటకాలకు.. అమితమైన ప్రజాధారణ ఉండేది. అనంతరం సినిమాలకు మెల్లమెల్లగా ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అప్పట్లో ఒక్కో సినిమా ఏకంగా రెండు, మూడు సంవత్సారాలు థియేటర్లో ఆడేవి. ఇక అప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ట్రండ్ సెట్ చేసిన ఓల్డ్ సినిమాలేంటో చూద్దామా..!! సతీ సావిత్రి(1933): చిత్ర పరిశ్రమ మొదలైన తరువాత.. అప్పట్లో ఫస్ట్ టైం లక్ష రూపాయల […]
1933 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆదరణ లభిస్తూ.. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తూ వచ్చింది. మొదట నాటకాలకు.. అమితమైన ప్రజాధారణ ఉండేది. అనంతరం సినిమాలకు మెల్లమెల్లగా ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అప్పట్లో ఒక్కో సినిమా ఏకంగా రెండు, మూడు సంవత్సారాలు థియేటర్లో ఆడేవి. ఇక అప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ట్రండ్ సెట్ చేసిన ఓల్డ్ సినిమాలేంటో చూద్దామా..!!
సతీ సావిత్రి(1933): చిత్ర పరిశ్రమ మొదలైన తరువాత.. అప్పట్లో ఫస్ట్ టైం లక్ష రూపాయల షేర్స్ అందుకున్న చిత్రం.
త్యాగయ్య (1946): ఈ సినిమా 25 లక్షల లాభాలు అందుకుంది.
పాతాళ భైరవి (1951): ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో.. తెరకెక్కిన అద్భుతమైన సినిమా పాతాళ భైరవి. ఈ సినిమా 50 లక్షల షేర్స్ అందుకుంది.
మాయా బజార్ (1957): అప్పటి కాలంలో.. చరిత్ర సృష్టించి రికార్డులు సృష్టించిన సినిమా మాయాబజార్. కోటి రూపాయల షేర్స్ సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమా
లవకుశ (1963): సావిత్రి, సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా లవకుశ ఈ సినిమా 1.25 షేర్ వ్యాల్యూ సాధించింది.
దసరా బుల్లోడు (1971): అక్కినేని నాగేశ్వర్ రావు, వాణిశ్రీ, చంద్రకళ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 71లో కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అప్పట్లోనే ఈ సినిమా కోటిన్నర వసూళ్లు రాబట్టింది.
అడవి రాముడు (1977): దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నటించిన సినిమా అడవి రాముడు ఈ సినిమా అప్పట్లో 3 కోట్లకు పైగా షేర్ సాధించింది.
అల్లూరి సీతారామరాజు (1974): కృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 2 కోట్ల షేర్స్ అందించింది.
ప్రేమాభిషేకం (1981): దసరా బుల్లోడు సినిమా తరువాత టాలీవుడ్లో 4 కోట్లు సాధించిన మొదటి తెలుగు సినిమా ఇది.
యముడికి మొగుడు (1988): ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించి 5 కోట్లు వసూలు చేసింది.
చంటి (1992): విక్టరీ వెంకటేష్కి మంచి సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సినిమా. విలక్షణంగా నటించి మెప్పించారు వెంకటేష్. ఇక ఈ చిత్రం 9 కోట్ల షేర్స్ అందుకు ఫస్ట్ మూవీగా రికార్డ్ సాధించింది.
ఘరానా మొగుడు (1992): చంటి సినిమా తరువాత మరోసారి బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా చిరంజీవి నటించిన ఘరానా మొగుడు. ఈ సినిమా 10 కోట్ల షేర్స్ సాధించిన ఫస్ట్ మూవీ.
పెద రాయుడు (1995): మోహన్బాబు పవర్ ఫుల్ యాక్టింగ్ చేసిన ఈ సినిమా.. థియేటర్లో నిరంతరాయంగా రెండు సంవత్సరాలు ఆడింది. ఈ సినిమాకి 12 కోట్లు వసూలు అయ్యాయి.
సమరసింహారెడ్డి (1999): బాలకృష్ణ కెరీర్లో ఫుల్ మాస్ సినిమాగా ఈ చిత్రం నిలుస్తుందనే చెప్పాలి. ఈ సినిమా 99లో 15 కోట్ల వసూలు సాధించిన మొదటి సినిమా.
నువ్వేకావాలి (2000): తరుణ్, రిచా జంటగా నటించి.. మెప్పించిన సినిమా. వీరిద్దరూ ఒకేసారి సినిమాకి పరిచయమయ్యారు. ఈ చిత్రం 19.5 కోట్లు సాధించింది.
నరసింహా రెడ్డి (2001): నందమూరి బాలకృష్ణ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇది. ఈ సినిమా 21.75 కోట్లు సాధించింది.
ఇంద్ర (2002): మెగాస్టార్ చిరంజీవి నటించిన పవర్ ఫుల్ ఫిల్మ్.. ఇంద్ర.. ఈ సినిమా 2002లో 25 కోట్ల షేర్స్ సాధించి.. చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.