న‌డి రోడ్డుపై పేలిన బాంబు.. ఆరుగురు మృతి..

అఫ్గానిస్థాన్‌-కాబూల్‌లో నడి రోడ్డుపై బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఓ మహిళ‌, చిన్నారి కూడా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా వీరితో ప్ర‌యాణిస్తోన్న మ‌రో 8 మందికి కూడా తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు ఆఫ్గాన్‌లో ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్తోన్న...

న‌డి రోడ్డుపై పేలిన బాంబు.. ఆరుగురు మృతి..
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 8:03 AM

అఫ్గానిస్థాన్‌-కాబూల్‌లో నడి రోడ్డుపై బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఓ మహిళ‌, చిన్నారి కూడా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా వీరితో ప్ర‌యాణిస్తోన్న మ‌రో 8 మందికి కూడా తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు ఆఫ్గాన్‌లో ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్తోన్న ఓ వాహ‌నం రోడ్డు ప‌క్క‌నే ప‌డి ఉన్న బాంబును ఢీ కొన‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానిక అధికారులు తెలిపారు. ఘాజ్నీ రాష్ట్రానికి చెందిన తాలిబ‌న్ తిరుగుబాటు దారులే ఈ అఘాయిత్యానికి పాల్ప‌డి ఉంటార‌ని ఆ రాష్ట్ర గ‌వర్న‌ర్ వాహిదుల్లా జ‌మ‌జ‌దా అనుమానం వ్య‌క్తం చేశారు.

కాగా జులై 8వ తేదీ బుధ‌వారం కూడా తాలిబ‌న్ తిరుగుబాటు దారులు దాయ‌క్ జిల్లాలో ఇలాంటి త‌ర‌హా దాడులే జ‌రిపారు. ఈ ప్ర‌మాదంలో జిల్లా పోలీస్ అధికారి స‌హా ఆయ‌న అంగ‌ర‌క్ష‌కులు ఇద్ద‌రూ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఆఫ్గాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తూర్పు లోగ‌ర్ రాష్ట్రంలో తాలిబ‌న్ దాడుల‌కు ఆఫ్గాన్ సైనిక బ‌ల‌గాలు తిప్పికొట్టాయ‌ని తెలిపింది. ఈ దాడిలో దారుణంగా 8 మంది మ‌ర‌ణించారు.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..

ప్ర‌ముఖ న‌టి రేఖ బంగ్లాకి సీల్..