క్వారంటైన్ లో అలుగు.. కరోనా పరీక్షలు చేయనున్న వైద్యులు !
కరోనా మహమ్మారి మనుషులనే కాదు మూగ ప్రాణులను కూడా విడిచిపెట్టడంలేదు. ఇప్పటికే పులులు, పిల్లులు కరోనా వైరస్ బారిన పడినట్టు కథనాలు వెలుగు చూశాయి. తాజాగా ఒడిశాలో అలుగు(పాంగోలిన్) కూడా కరోనా పరీక్షలు ఎదుర్కొక తప్పలేదు. కటక్ జిల్లా సబ్డివిజన్ పరిధిలోని అథాగఢ్ ఫారెస్ట్ రేంజ్లో ఉన్న ఓ క్వారంటైన్ కేంద్రంలో కనిపించిన అలుగును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీనికి కోవిడ్-19 నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్ఓ) సస్మిత లెంకా తెలిపారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ […]
కరోనా మహమ్మారి మనుషులనే కాదు మూగ ప్రాణులను కూడా విడిచిపెట్టడంలేదు. ఇప్పటికే పులులు, పిల్లులు కరోనా వైరస్ బారిన పడినట్టు కథనాలు వెలుగు చూశాయి. తాజాగా ఒడిశాలో అలుగు(పాంగోలిన్) కూడా కరోనా పరీక్షలు ఎదుర్కొక తప్పలేదు. కటక్ జిల్లా సబ్డివిజన్ పరిధిలోని అథాగఢ్ ఫారెస్ట్ రేంజ్లో ఉన్న ఓ క్వారంటైన్ కేంద్రంలో కనిపించిన అలుగును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీనికి కోవిడ్-19 నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్ఓ) సస్మిత లెంకా తెలిపారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం ఒడిశాలో ఇప్పటివరకు 1,438 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడిన వారిలో 649 మంది కోలుకోగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.