మీరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా..?
మన శరీరానికి విటమిన్లు ఎంత అవసరమో.. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో.. మనందరికీ తెలిసిన విషయమే. శరీరానికి కావాల్సిన పోషణకు, అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే.. ఇది డాక్టర్ సూచన మేరకే వాడాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు సొంతంగా ఈ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో చాలా ప్రమాదాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ట్యాబెట్లు.. ఉన్న సమస్యను నివారించాల్సింది పోయి మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చే […]
మన శరీరానికి విటమిన్లు ఎంత అవసరమో.. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో.. మనందరికీ తెలిసిన విషయమే. శరీరానికి కావాల్సిన పోషణకు, అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే.. ఇది డాక్టర్ సూచన మేరకే వాడాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు సొంతంగా ఈ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో చాలా ప్రమాదాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ట్యాబెట్లు.. ఉన్న సమస్యను నివారించాల్సింది పోయి మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చే ప్రమాదముందని తెలిపారు.
రోజుకు 100 గ్రాముల మోతాదు వరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. ఈ మోతాదు మించితే నాడులు డ్యామేజ్ అవుతాయి. దీంతో.. చర్మ వ్యాధులు, అసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అయితే.. వీటి బదులు చేపలు, ఆలుగడ్డలు, అవకాడోలు, పిస్తా పప్పు తింటే సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
శాస్త్రవేత్త డాక్టర్ ఫాంగ్ జాంగ్ ప్రకారం.. ‘పోషకాలు ఆహారంగా తీసుకుంటే.. మంచిదని.. ట్యాబ్లెట్స్ రూపంలో దానిని తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. అలాగే.. విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరణానికి కూడా దారితీస్తుందని కనుగొన్నారు.
కాగా.. బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ ప్రొఫెసర్ జూడీ బట్ట్రిస్ కనుగొన్న దాని ప్రకారం.. విటమిన్ ట్యాబ్లెట్స్ మరణాన్ని వీలైనంతగా దరిచేరనీయకుండా ఉండే ప్రయత్నం చేస్తాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే అన్ని రకాల విటమిన్లు అందుతాయని చెప్పి కొందరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన లేకుండానే వేసుకుంటున్నారు. అయితే.. వీటి మోతాదు గనక శరీరంలో ఎక్కువైతే.. హార్ట్ ఎటాక్లు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి.. ఆచి తూచి వ్యవహరించడం మంచిది. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.