నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం
విశాఖపట్నం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కేజీహెచ్లో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ రూమ్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనకాపల్లికి చెందిన శివలక్ష్మీ కేజీహెచ్లో లాస్ట్ ఇయర్ చదువుతోంది. మరో మూడు నెలల్లో కోర్సు ముగుస్తుందనగా ఇలా జరగడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.కాగా కాలేజ్ సిబ్బంది వేధింపుల కారణంగానే శివలక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడిందంటూ బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయమే తమ కూతురు ఫోన్ చేసిందని, […]
విశాఖపట్నం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కేజీహెచ్లో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ రూమ్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనకాపల్లికి చెందిన శివలక్ష్మీ కేజీహెచ్లో లాస్ట్ ఇయర్ చదువుతోంది. మరో మూడు నెలల్లో కోర్సు ముగుస్తుందనగా ఇలా జరగడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.కాగా కాలేజ్ సిబ్బంది వేధింపుల కారణంగానే శివలక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడిందంటూ బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయమే తమ కూతురు ఫోన్ చేసిందని, అప్పుడు బాగానే మాట్లాడిందని చెప్పారు. ఇంతలోనే తెల్లవారే సరికి తమ కూతురు మరణ వార్త తెలిసి ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.