నిమ్స్ నర్సుకు కరోనా.. చికిత్స తీసుకున్న వారందరిలో టెన్షన్..
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ఓ స్టాఫ్ నర్స్ కోవిడ్ బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ మహిళకు కరోనా వైరస్..
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ఓ స్టాఫ్ నర్స్ కోవిడ్ బారిన పడింది. ఇప్పుడు ఈ విషయం నిమ్స్ ఆస్పత్రిలోని అందరినీ ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆమె ద్వారా నర్సుకు వైరస్ సోకినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మహిళకు చికిత్స అందించిన పలువురు వైద్యులని, సిబ్బందిని క్వారంటైన్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు.
కాగా కొద్ది రోజుల కిందట గుండె సమస్యతో బాధ పడుతున్న ఓ మహిళ ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు ఐదుగురు డాక్టర్లు చికిత్స చేశారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది. అనంతరం కరోనా లక్షణాలుగా అనుమానించిన వైద్యులు ఆమె నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా.. ఆమెకు కోవిడ్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో ఆస్పత్రిలోని వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేసి.. వారందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు నిమ్స్ వైద్యులు.
Read More:
అక్కడ బ్లీచింగ్ అమ్మకాలు బంద్.. కారణమిదే!
ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం
ఫేస్బుక్లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్