చంద్రబాబును అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందన్నారు

మాజీ సీఎం ఎన్టీఆర్‌ చనిపోతే రోజుల్లో చంద్రబాబు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే.. చంద్రబాబును తప్పకుండా అండమాన్‌ జైలుకు..

చంద్రబాబును అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందన్నారు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 25, 2020 | 9:31 AM

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు వైసీపీ నేత లక్ష్మీ పార్వతి. తన భర్త ఎన్టీఆర్ బ్రతికున్న రోజుల్లో చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారో లక్ష్మీ పార్వతి ప్రస్తావించారు. ‘మాజీ సీఎం ఎన్టీఆర్‌ చనిపోయిన రోజుల్లో చంద్రబాబు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే.. చంద్రబాబును తప్పకుండా అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందని తనతో అన్నట్లు లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు’. అయినా చంద్రబాబుకు త్వరలోనే ఆ గతి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. ఏపీలో గత పాలనపై ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వాస్తవాలన్నీ బయటకు వస్తాయని, త్వరలోనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా ముగ్గరూ జైలుకెళ్లడం నేను చూస్తానని ఆమె ఆరోపణలు చేశారు.

కాగా.. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలుగు సాహిత్య పీఠాన్ని విశ్వ విద్యాలయంగా మార్చి అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే తెలుగు భాషతో పాటు, ఇంగ్లీషు కూడా సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. తెలుగు భాష అమ్మే.. కానీ.. అప్పుడప్పుడు కొన్ని మెళుకువలు పాటించాలన్నారు లక్ష్మీ పార్వతి.