ప్రక్షాళన దిశగా తెలంగాణ నీటిపారుదల శాఖ.. కొత్తగా 628 ఇంజినీర్‌ పోస్టులు

నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టుల నుంచి కాలువల వరకు నిర్వహణకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రక్షాళన దిశగా తెలంగాణ నీటిపారుదల శాఖ.. కొత్తగా 628 ఇంజినీర్‌ పోస్టులు
Follow us

|

Updated on: Sep 07, 2020 | 3:50 PM

నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టుల నుంచి కాలువల వరకు నిర్వహణకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఏఈ, జేఈల పరిధిలో మార్పులు తీసుకొస్తోంది. ఒక వర్క్‌ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరి కంటే ఎక్కువ మంది లష్కర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియామక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది.

కొత్త విధానంలో భాగంగా నీటిపారుదల శాఖ పేరును జలవనరుల శాఖగా మార్పుచేయాలని కేసీఆర్ ప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది. దీంతో పాటు ఇంజినీర్ల పోస్టులు మరో 628 పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఆరు నెలలుగా నీటిపారుదల శాఖ ప్రక్షాళన ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా అధికారులు, ఇంజినీర్లు ముసాయిదాకు తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన సమీక్షలో మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. నీటిపారుదల కొత్త ముసాయిదాకు ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే ఈ శాసన సభ సమావేశాల్లోనే చట్టం చేయనున్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి రావడం, ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శాఖను పునర్‌వ్యవస్థీకరించాలని సీఎం కేైసీఆర్ సంకల్పించారు. క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపైనా దృష్టిసారించారు. భారీ, మధ్య, చిన్న తరహా..ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందకి తెస్తున్నారు. జిల్లా స్థాయిలో నీటి పారుదల అభివృద్ధి సంస్థతోపాటు, అన్ని విభాగాలను సీఈ పరిధిలోకి తీసుకురానున్నారు. ఎస్‌ఈలు, ఈఈలతోపాటు క్షేత్రస్థాయి ఇంజినీర్లందరూ సీఈ పర్యవేక్షణ కింద విధులు నిర్వర్తించేలా వ్యవస్థలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది సీఈలు ఉండాలని తొలుత భావించినప్పటికీ, ఆ సంఖ్యను 28కే పరిమితం చేయాలనే నిర్ణయించినట్లు సమాచారం. మొత్తంగా ఇంజినీరింగ్‌ సంబంధ పోస్టులు మరో 628 పెంచాలని ఉన్నతాధికారులు ముసాయిదా సిద్ధం చేశారు.

ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 6,660 మంది లష్కర్లు అవసరమని (జీవో నెం.29 ప్రకారం) గతంలో పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. తక్షణ అవసరాలకు నాలుగు వేల మంది అవసరమని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రభుత్వానికి నివేదించారు. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో 1600 పోస్టుల మంజూరు ఉండగా, 1300 మంది మాత్రమే పనిచేస్తున్నారు. తదనుగుణంగా క్షేత్రస్థాయి సిబ్బంది పెంచి ప్రాజెక్టులు, నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్.. ఇప్పుడిప్పుడే..
కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్.. ఇప్పుడిప్పుడే..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!