ఏపీలో ఉద్యోగాల జాతర..ఈసారి 20వేల పోస్టులు !
ఏపీలో ఉద్యోగాల నగారా మోగింది. ఈసారి సుమారు 20 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ లక్ష్యంతో నియమించిన గ్రామ వాలెంటీర్ల వ్యవస్థలో భారీ సంఖ్యలో వున్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19వేల 170 వార్డు వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు సంఖ్య 70వేల 888 కాగా ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లు 51వేల 718. […]
ఏపీలో ఉద్యోగాల నగారా మోగింది. ఈసారి సుమారు 20 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ లక్ష్యంతో నియమించిన గ్రామ వాలెంటీర్ల వ్యవస్థలో భారీ సంఖ్యలో వున్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19వేల 170 వార్డు వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు సంఖ్య 70వేల 888 కాగా ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లు 51వేల 718. వివిధ కారణాలతో ఉద్యోగంలో చేరని, తప్పుకున్న వాలంటీర్ల సంఖ్య 19వేల 170. ఈ పోస్టుల భర్తీకి అనుమతించాల్సిందిగా పురపాలకశాఖ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరిన నేపథ్యంలో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో పాటు నోటిఫికేషన్ విడుదలకు ఆయన అనుమతించారు. త్వరలో 19వేల 170 వార్డు వాలెంటీర్ పోస్టుల భర్తీకి పురపాలక శాఖ సిద్దమవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.