అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు..ట్విట్టర్ ద్వారా క్లారిటీ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్య విషయంపై గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో ఉన్నారని.. అందుకే బయటకు రావడం లేదని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ అనేక రకాల వదంతులు ట్రోల్ అవుతున్నాయి. మరికొంత మంది అమిత్ షా వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇదంతా చూసి పలువురు బీజేపీ శ్రేణులు, అమిత్ షా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ […]
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్య విషయంపై గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో ఉన్నారని.. అందుకే బయటకు రావడం లేదని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ అనేక రకాల వదంతులు ట్రోల్ అవుతున్నాయి. మరికొంత మంది అమిత్ షా వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇదంతా చూసి పలువురు బీజేపీ శ్రేణులు, అమిత్ షా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ విషయం తెలుసుకున్న అమిత్ షా.. తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని.. తన ఆరోగ్యం బాగులేదంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను ఏ వ్యాధితో కూడా బాధపడటం లేదని స్పష్టం చేశారు. ఈ పుకార్లు ఎవరు చేస్తున్నారో ఏమో కానీ.. వారు ఇలా చేయడం ద్వారా నా ఆయుష్షు మరికొంచెం పెరుగుతుందని.. కరోనా నేపథ్యంలో నిత్యం జరుగుతున్న పనుల్లో బిజీబిజీగా ఉండి ఈ రూమర్స్పై పట్టించుకోలేదంటూ అమిత్ షా తెలిపారు.
मेरे स्वास्थ्य की चिंता करने वाले सभी लोगों को मेरा संदेश। pic.twitter.com/F72Xtoqmg9
— Amit Shah (@AmitShah) May 9, 2020