‘జవాన్లకు డొక్కు ట్రక్కులు, మరి మీకు ఖరీదైన విమానాలా ‘? మోదీపై రాహుల్ ఫైర్
సరిహద్దుల్లో నిరంతరం దేశ భద్రతకోసం శ్రమిస్తున్న మన జవాన్లు బుల్లెట్ ప్రూఫ్ లేని ట్రక్కుల్లో ప్రయాణిస్తున్నారని, మరి ప్రభుత్వం మాత్రం వారి ప్రాణాలను గాలికి వదిలేసి రూ. 8.400 కోట్ల ఖరీదైన విమానాల కోసం అర్రులు చాస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వీటిని ప్రధాని మోదీ కోసం ఏర్పాటు చేస్తున్నారని, ఇది న్యాయమేనా అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొందరు సైనికులు ఓ ట్రక్కులో ప్రయాణిస్తూ తమలో తాము మాట్లాడుకుంటున్న […]
సరిహద్దుల్లో నిరంతరం దేశ భద్రతకోసం శ్రమిస్తున్న మన జవాన్లు బుల్లెట్ ప్రూఫ్ లేని ట్రక్కుల్లో ప్రయాణిస్తున్నారని, మరి ప్రభుత్వం మాత్రం వారి ప్రాణాలను గాలికి వదిలేసి రూ. 8.400 కోట్ల ఖరీదైన విమానాల కోసం అర్రులు చాస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వీటిని ప్రధాని మోదీ కోసం ఏర్పాటు చేస్తున్నారని, ఇది న్యాయమేనా అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొందరు సైనికులు ఓ ట్రక్కులో ప్రయాణిస్తూ తమలో తాము మాట్లాడుకుంటున్న వీడియోను రాహుల్ షేర్ చేశారు. అందులో ఓ జవాన్.. మనం నాన్-బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్తున్నామని, ఇది సురక్షితం కాదని, వాళ్ళు (సీనియర్ అధికారులు) మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అంటాడు. మనం మన జీవితాలను వృధా చేస్తున్నామని వాపోతాడు. ఇది చాలా దయనీయమైన ఏర్పాటని, సీనియర్లు బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కుల్లో వెళ్తే మనం ఇలాంటి డొక్కు వాహనాల్లో ప్రయాణించవలసి వస్తోందని మరో జవాన్ వ్యాఖ్యానిస్తాడు. అయితే ఈ వీడియో ఎక్కడిదన్నది స్పష్టం కాలేదు.
हमारे जवानों को नॉन-बुलेट प्रूफ़ ट्रकों में शहीद होने भेजा जा रहा है और PM के लिए 8400 करोड़ के हवाई जहाज़!
क्या यह न्याय है? pic.twitter.com/iu5iYWVBfE
— Rahul Gandhi (@RahulGandhi) October 10, 2020