కనెక్టింగ్ పీపుల్.. రంగంలోకి మళ్ళీ నోకియా
ఒకప్పడు మొబైల్ హ్యాండ్సెట్ల రంగంలో అగ్రగామిగా వెలుగొంది.. ఆ తర్వాత ఒక్కసారిగా అంతర్ధానమై పోయిన నోకియా కంపెనీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారీ లక్ష్యంతో దూసుకొస్తోంది. ఇందుకోసం మొబైల్ నెట్వర్క్ సంస్థ ఎయిర్టెల్తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఒకప్పడు మొబైల్ హ్యాండ్సెట్ల రంగంలో అగ్రగామిగా వెలుగొంది.. ఆ తర్వాత ఒక్కసారిగా అంతర్ధానమై పోయిన నోకియా కంపెనీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారీ లక్ష్యంతో దూసుకొస్తోంది. ఇందుకోసం మొబైల్ నెట్వర్క్ సంస్థ ఎయిర్టెల్తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశ మార్కెట్లో కోల్పోయిన ఒకప్పటి ఉన్నత స్థానాన్ని తిరిగి పొందేందుకు నోకియా ప్రయత్నాలను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఎయిర్టెల్ సంస్థతో ఒక బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఎయిర్టెల్ వంటి అగ్రగామి మొబైల్ ఆపరేటింగ్ సంస్థతో 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకున్నట్లు ఫిన్లాండ్కు చెందిన నోకియా మంగళవారం ప్రకటించింది. ఎయిర్టెల్ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు నోకియా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా దేశంలో వినియోగదారులకు 4జీ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచి.. అత్యున్నత వేగంతో 5జీ ఇంటర్నెట్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నోకియా ప్రతినిధులు తెలిపారు.
2022 సంవత్సరాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 3 లక్షల కొత్త మొబైల్ టవర్లను నెలకొల్పడమే లక్ష్యంగా నోకియా, ఎయిర్టెల్లు కలిసి పనిచేయనున్నామని నోకియా ప్రతినిధులు ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న 4జీ నెట్వర్క్ను మరింత వేగవంతం చేయడంతో పాటు, కొత్తగా 5జీ ఇంటర్నెట్ను వినియోగదారులకు అందించేందుకు దేశంలో ప్రస్తుతం ఎయిర్టెల్ నెట్వర్క్కు ఉన్న 9 మొబైల్ సర్కిళ్లకు ఈ తాజా ఒప్పందం వర్తిస్తుందని వారు వివరించారు.
అతిపెద్ద టెలికాం మార్కెట్లలో కనెక్టివిటీ భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యమైన ఒప్పందమని, భారతదేశంలో తన స్థానాన్ని ఇది మరింత పటిష్టం చేస్తుందని నోకియా సీజీవో ప్రకటించారు. సుమారు 135 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అ టెలికాం మార్కెట్ అయిన భారతదేశంలో మునుముందు పెరగనున్న ఆన్లైన్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందం చేసుకున్నట్లు నోకియా ప్రతినిధులు, ఎయిర్టెల్ బృందం వెల్లడించింది.