ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే..!
కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనన్నారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి.. ప్రాయశ్చిత్త మార్గమే ఈ సీఏఏ అని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. డెబ్బై ఏళ్ల క్రితమే ఈ పౌరసత్వ […]
కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనన్నారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి.. ప్రాయశ్చిత్త మార్గమే ఈ సీఏఏ అని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. డెబ్బై ఏళ్ల క్రితమే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాల్సిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయకుండా.. మతరాజకీయాలు చేసిందని.. దేశాన్ని మత ప్రాతిపదికన విభజన చేశారన్నారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మైనార్టీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయని.. వారి సంఖ్య నానాటికి తగ్గిపోతుందన్నారు. ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి అందరూ కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఈ చట్టంపై కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహలను సృష్టిస్తోందని ఆరోపించారు. పూర్వులు చేసిన దేశ విభజనకు ప్రాయశ్చిత్తమే… ఈ పౌరసత్వ సరవణ చట్టమని మంత్రి సారంగీ పేర్కొన్నారు.
#WATCH Union Minister Pratap Sarangi in Surat, Gujarat: Those who do not accept Vande Mataram have no right to live in India. (18.01.2020) pic.twitter.com/zEr4R8Z7Op
— ANI (@ANI) January 18, 2020