సరిలేరు టీజర్.. రష్మిక మిస్సింగ్ కహానీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు ఫ్యాన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మహేష్ మాస్ లుక్, డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు.. ఇలా ఒకటి కాదు.. టీజర్లో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా లేడి అమితాబ్ విజయశాంతి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ప్రముఖ నటీనటులందరినీ టీజర్లోనే పరిచయం చేసిన దర్శకుడు.. హీరోయిన్ రష్మికను మాత్రం మర్చిపోయాడు. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు ఫ్యాన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మహేష్ మాస్ లుక్, డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు.. ఇలా ఒకటి కాదు.. టీజర్లో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా లేడి అమితాబ్ విజయశాంతి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ప్రముఖ నటీనటులందరినీ టీజర్లోనే పరిచయం చేసిన దర్శకుడు.. హీరోయిన్ రష్మికను మాత్రం మర్చిపోయాడు. కనీసం ఒక్క షాట్లో కూడా హీరోయిన్ లేకపోవడంతో ఆమె ఫాన్స్ అనిల్పై ఫైర్ అవుతున్నారు.
అయితే రష్మిక ను టీజర్లో చూపించకపోవడం వెనుక కారణాలు ఉన్నాయని ఓ వర్గం ప్రేక్షకులు చెబుతుండగా.. ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదని.. అందుకే ఒక షాట్లో కూడా చూపించలేదని మరికొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగక తప్పదు. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.