మెరుగైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత యువతదే
నిజమైన స్వాతంత్య్రాన్ని అనుభవించాలంటే సమాజంలో జరుగుతున్న అన్యాయం, అసహనం, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సోనియా గాంధీ పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశం అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని, అయినా ఇప్పటికీ.. మూఢవిశ్వాసం, మతమౌఢ్యం, అన్యాయం, అసహనం, వివక్షలు ఉన్నాయన్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇంకా జాతివివక్షత కొనసాగడం […]
నిజమైన స్వాతంత్య్రాన్ని అనుభవించాలంటే సమాజంలో జరుగుతున్న అన్యాయం, అసహనం, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సోనియా గాంధీ పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశం అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని, అయినా ఇప్పటికీ.. మూఢవిశ్వాసం, మతమౌఢ్యం, అన్యాయం, అసహనం, వివక్షలు ఉన్నాయన్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇంకా జాతివివక్షత కొనసాగడం విచారకరమన్నారు. ప్రజలు సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతితో మెలగాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతను అందింపుచ్చుకొని మెరుగైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తుచేశారు.