తెలుగు రాష్ట్రాల్లో 733కు చేరిన కరోనా కేసులు
కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ శర వేగంగా పెరుగుతోంది. భారత్లోనూ వైరస్ విస్తరిస్తోంది. దేశంలో 211 రాష్ట్రాలు వైరస్ బారినపడి అల్లాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై..
గతేడాది డిసెంబరు చివరిన ఎక్కడో చైనాలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా దేశాలకు విస్తరించి.. కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ శర వేగంగా పెరుగుతోంది. భారత్లోనూ వైరస్ విస్తరిస్తోంది. దేశంలో 211 రాష్ట్రాలు వైరస్ బారినపడి అల్లాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై కూడా కరోనా కోరలు చాస్తోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329 కాగా, తెలంగాణలో 404కు చేరింది.
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 329కి చేరింది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు నమోదైన లెక్కల ప్రకారం ఈ మేరకు బులిటెన్ విడుదల చేశారు. నెల్లూరులో 6, కృష్ణా 6, చిత్తూరు జిల్లాల్లో 3 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదయినట్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందగా ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో కేసుల సంఖ్య 49కి చేరింది. గుంటూరు జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 35, కడప జిల్లాలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 24, పశ్చిమగోదావరిలో 21 కేసులున్నాయి. ఏపీలోని మొత్తం కేసుల్లో సగానికి పైగా కర్నూలు.. నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో టెన్షన్ నెలకొంది. ఏపీ సర్కార్ కరోనా పరీక్షా కేంద్రాల సామర్ధ్యం పెంచింది. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అధికారులు రెడ్జోన్లను క్లస్టర్లుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇటు తెలంగాణలోనూ గత 24 గంటలలో మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 404కి చేరింది. హైదరాబాద్లో అత్యధికంగా 154 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11 మంది చనిపోయారు. ఇప్పటివరకు 45 మంది పూర్తిగా కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 348 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లో మర్కజ్ కేసులతో లింకున్న వారందరి పరీక్షలన్నీ పూర్తికానున్నాయి. అందులో ఎంత మందికి పాజిటివ్గా ఉందనేది తేలనుంది.