తెలుగు రాష్ట్రాల్లో 733కు చేరిన క‌రోనా కేసులు

కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ శర వేగంగా పెరుగుతోంది. భార‌త్‌లోనూ వైర‌స్ విస్త‌రిస్తోంది. దేశంలో 211 రాష్ట్రాలు వైర‌స్ బారినప‌డి అల్లాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల‌పై..

తెలుగు రాష్ట్రాల్లో 733కు చేరిన క‌రోనా కేసులు
Follow us

|

Updated on: Apr 08, 2020 | 12:58 PM

గ‌తేడాది డిసెంబరు చివరిన ఎక్క‌డో చైనాలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200ల‌కు పైగా దేశాలకు విస్తరించి.. కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ శర వేగంగా పెరుగుతోంది. భార‌త్‌లోనూ వైర‌స్ విస్త‌రిస్తోంది. దేశంలో 211 రాష్ట్రాలు వైర‌స్ బారినప‌డి అల్లాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల‌పై కూడా క‌రోనా కోర‌లు చాస్తోంది. ఏపీలో క‌రోనా బాధితుల సంఖ్య 329 కాగా, తెలంగాణ‌లో 404కు చేరింది.

ఏపీలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 329కి చేరింది. మంగ‌ళ‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు న‌మోదైన లెక్క‌ల ప్ర‌కారం ఈ మేర‌కు బులిటెన్ విడుద‌ల చేశారు. నెల్లూరులో 6, కృష్ణా 6, చిత్తూరు జిల్లాల్లో 3 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదయినట్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందగా ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో కేసుల సంఖ్య 49కి చేరింది. గుంటూరు జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 35, కడప జిల్లాలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 24, పశ్చిమగోదావరిలో 21 కేసులున్నాయి. ఏపీలోని మొత్తం కేసుల్లో సగానికి పైగా కర్నూలు.. నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో టెన్షన్ నెలకొంది. ఏపీ సర్కార్‌ కరోనా పరీక్షా కేంద్రాల సామర్ధ్యం పెంచింది. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అధికారులు రెడ్‌జోన్లను క్లస్టర్లుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇటు తెలంగాణలోనూ గ‌త 24 గంట‌ల‌లో మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 404కి చేరింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 154 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11 మంది చనిపోయారు. ఇప్పటివరకు 45 మంది పూర్తిగా కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 348 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లో మర్కజ్ కేసులతో లింకున్న వారందరి పరీక్షలన్నీ పూర్తికానున్నాయి. అందులో ఎంత మందికి పాజిటివ్‌గా ఉంద‌నేది తేల‌నుంది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన