ఇకపై పైలట్లకు ఇంటి భోజనం లేనట్టే..!
ఇంటి భోజనమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తమ లంచ్ బాక్సులను ఉద్యోగులు ఆఫీసులకు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. కానీ ఇకపై విమానాల్లో పనిచేసే వారు ఆ ఛాన్స్ మిస్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్ధకు చెందిన పైలట్లు ఇకపై ఇంటి భోజనాన్ని తెచ్చుకోవడాన్ని కోల్పోబోతున్నారు. ఇంటి భోజనంపై ఆంక్షలు విధించాలని సంస్ధ అధికారులు ఆలోచన కూడా చేస్తున్నారట. ఇటీవల బెంగళూరు నుంచి కోల్ కతా వెళుతున్న ఓ ఎయిరిండియా విమానంలో పైలట్ తాను […]
ఇంటి భోజనమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తమ లంచ్ బాక్సులను ఉద్యోగులు ఆఫీసులకు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. కానీ ఇకపై విమానాల్లో పనిచేసే వారు ఆ ఛాన్స్ మిస్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్ధకు చెందిన పైలట్లు ఇకపై ఇంటి భోజనాన్ని తెచ్చుకోవడాన్ని కోల్పోబోతున్నారు. ఇంటి భోజనంపై ఆంక్షలు విధించాలని సంస్ధ అధికారులు ఆలోచన కూడా చేస్తున్నారట. ఇటీవల బెంగళూరు నుంచి కోల్ కతా వెళుతున్న ఓ ఎయిరిండియా విమానంలో పైలట్ తాను తిన్న బాక్స్ ను శుభ్రం చేయాలని అక్కడే పనిచేస్తున్న సిబ్బందికి ఆర్డర్ వేయడంతో ..తామెందుకు శుభ్రం చేయాలని వారు వాగ్వాదానికి దిగారు. దీంతో విమానం రెండు గంటలు ఆలస్యమైంది. అధికారులు కల్పించుకుని ఈ గొడవకు కారణమైన ఇద్దరినీ విమానం నుంచి దించేసి ఆతర్వాత విమానాన్ని కోల్ కతాకు పంపించారు. ఈ నేపధ్యంలో ఇకపై ఎయిరిండియా విమానాల్లో పైలట్లు ఇంటి భోజనం తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోబోతున్నారు.