కరోనా టైంలో విమానం ప్రయాణం ఇలా ఉంది.. అనుభవాల్ని షేర్ చేసిన ఓ ప్రయాణికురాలు

ఫ్లైట్ ఎక్కేవారికి బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ లెవల్స్ అన్నీ చెక్ చేసి.. కరోనా లక్షణాలు లేవని తెలిస్తేనే వారికి స్టాంప్ వేసి.. క్వారంటైన్‌కి పంపిస్తున్నారట. అలాగే అందుకు కావాల్సిన స్నాక్స్..

కరోనా టైంలో విమానం ప్రయాణం ఇలా ఉంది.. అనుభవాల్ని షేర్ చేసిన ఓ ప్రయాణికురాలు
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 11:42 AM

ఇన్నాళ్లూ కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను.. ఇండియాకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మేఘన అనే ప్రయాణికురాలు లండన్ నుంచి బెంగూళురు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విమాన ప్రయాణం గురించి పలు చెప్పుకొచ్చారు. ఇది వరకు ఈ ప్రయాణం రొటీన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు అలాకాదు. కరోనా టైమ్‌ కాబట్టి భౌతిక దూరం పాటిస్తూ ఫ్లైట్ ఎక్కారట. ఈ సందర్భంగా తనలాగ ఎవరైనా భారత్‌కు వస్తే.. తన అనుభవాలు వారికి పనికివస్తాయన్న ఉద్ధేశ్యంతో ఆమె పలు ట్వీట్స్ చేసింది.

– ఫ్లైట్ ఎక్కేవారికి బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ లెవల్స్ అన్నీ చెక్ చేసి.. కరోనా లక్షణాలు లేవని తెలిస్తేనే వారికి స్టాంప్ వేసి.. క్వారంటైన్‌కి పంపిస్తున్నారట. అలాగే అందుకు కావాల్సిన స్నాక్స్ కూడా ఇస్తున్నారట.

– ఇది వరకు వేడి వేడి మీల్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడలా కాదు. ప్యాకింగ్ మీల్స్ మాత్రే ఇస్తున్నారు. అలాగే మొత్తం మీల్స్ సరిపడా వాటర్ ఇస్తున్నారు

– ఇది వరకు విమానంలో వాష్ రూమ్‌కి వెళ్లాల్సి వస్తే కొన్ని పరిమితులు ఉండేవి. ఇప్పుడు అన్‌ లిమిటెడ్. ఎన్నిసార్లైనా వెళ్లొచ్చు.

– కాగా ఫ్లైట్‌లో 30 శాతం మందికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు లేవు. అయితే కొంతమంది మాత్రం సేఫ్టీ కోసం.. మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకున్నట్లు ఆమె తెలిపింది.

– బెంగుళూరులో ఫ్లైట్ దిగిన తర్వాత అందర్నీ భౌతిక దూరం పాటిస్తూ బస్సులు ఎక్కించి, క్వారంటైన్ చేసిన మంచి హోటల్ గదులకు తీసుకువెళ్తున్నట్లు ఆమె పేర్కొంది.

Read More:

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిల్‌రాజు వెడ్స్ తేజస్విని.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం