ఓటీటీ కంటెంట్కు నో సెన్సార్.. కేంద్రం కీలక నిర్ణయం!
ఈ మధ్యకాలంలో యువత థియేటర్లలో సినిమాల చూడటం మీద కంటే.. ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫార్మ్స్పై వెబ్ సిరీస్లను వీక్షించడంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీన్ని బట్టే ఓటీటీలకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఓటీటీ డిజిటల్ కంటెంట్ పేరిట సెన్సార్ అనేది లేని కొత్తరకమైన ఎంటర్టైన్మెంట్ తయారవ్వడమే కాకుండా వల్గారిటీ, బూతులు కూడా ఎక్కువ అయిపోయాయి. ఇక వీటిపైన ఆకర్షితులైన యువత చెడు మార్గాల వైపు అడుగులు వేసే అవకాశం కూడా […]
ఈ మధ్యకాలంలో యువత థియేటర్లలో సినిమాల చూడటం మీద కంటే.. ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫార్మ్స్పై వెబ్ సిరీస్లను వీక్షించడంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీన్ని బట్టే ఓటీటీలకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఓటీటీ డిజిటల్ కంటెంట్ పేరిట సెన్సార్ అనేది లేని కొత్తరకమైన ఎంటర్టైన్మెంట్ తయారవ్వడమే కాకుండా వల్గారిటీ, బూతులు కూడా ఎక్కువ అయిపోయాయి. ఇక వీటిపైన ఆకర్షితులైన యువత చెడు మార్గాల వైపు అడుగులు వేసే అవకాశం కూడా లేకపోలేదన్నది కొందరి భావన.
అందుకే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 మొదలగున ఓటీటీ ప్లాట్ఫార్మ్స్కు సెన్సార్ తప్పనిసరి చేయాలని కొందరు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే ఇంకా ఈ ప్రతిపాదన మీనమేషాల దశలోనే ఉంది. ఇక తాజాగా ఈ అంశంపై ఇటీవల జరిగిన సి2 బిగ్ పిక్చర్ సమిట్ 2019కు హాజరైన కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ అమిత్ ఖరే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటీటీ కంటెంట్పై సెన్సార్ విధించినే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని అమిత్ ఖరే స్పష్టం చేశారు. ఇక కట్టడి పేరుతో కత్తెర వేసే అడ్డంకి లేకపోవడంతో ఇప్పటికే మన దర్శకులు రెచ్చిపోయి మరీ వివిధ రకాల జోనర్లలో వెబ్ సిరీస్లను తెరకెక్కిస్తున్నారు. వాటికి మంచి వ్యూవర్షిప్ కూడా దక్కుతోంది.