స్నానం చేయకండి.. బట్టలు ఉతక్కండి: విద్యార్థినులకు యూనివర్సిటీ సర్క్యులర్
‘‘స్నానం చేయకండి.. బట్టలు ఉతక్కండి’’ అంటూ విద్యార్థినులకు మైసూరు యూనివర్సిటీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీ జారీ చేసిన సర్క్యులర్పై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు నీళ్లొచ్చే వరకు మీరు కూడా బట్టలు ఉతక్కండి.. స్నానాలు చేయకండి’’ అంటూ యాజమాన్యాన్ని, అధికారులను ఉద్దేశిస్తూ వారు నినాదాలు చేస్తున్నారు. కాగా మైసూరు విశ్వవిద్యాలయంలో గత కొన్ని నెలలుగా నీటి ఎద్దటి తీవ్రంగా ఉంది. క్యాంపస్లో మొత్తం 40బోరుబావులుండగా.. వాటిలో 10పూర్తిగా ఎండిపోయాయి. మరికొన్నింటిలో నీరు తక్కువగా […]
‘‘స్నానం చేయకండి.. బట్టలు ఉతక్కండి’’ అంటూ విద్యార్థినులకు మైసూరు యూనివర్సిటీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీ జారీ చేసిన సర్క్యులర్పై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు నీళ్లొచ్చే వరకు మీరు కూడా బట్టలు ఉతక్కండి.. స్నానాలు చేయకండి’’ అంటూ యాజమాన్యాన్ని, అధికారులను ఉద్దేశిస్తూ వారు నినాదాలు చేస్తున్నారు.
కాగా మైసూరు విశ్వవిద్యాలయంలో గత కొన్ని నెలలుగా నీటి ఎద్దటి తీవ్రంగా ఉంది. క్యాంపస్లో మొత్తం 40బోరుబావులుండగా.. వాటిలో 10పూర్తిగా ఎండిపోయాయి. మరికొన్నింటిలో నీరు తక్కువగా వస్తోంది. తీవ్ర ఎద్దడితో మూడు నెలలుగా అక్కడి విద్యార్థినులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారానికోసారి ట్యాంకర్ల ద్వారా అక్కడికి నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా అక్కడ ఉన్న 3వేల మందికి ఆ నీళ్లు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ సర్క్యులర్ జారీ చేయడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. అయితే ఈ పరిస్థితిపై మైసూరు సిటీ కార్పోరేషన్కు ఫిర్యాదు చేశామని.. ఎన్నికలు పూర్తయ్యాక సమస్యను పరిష్కరిస్తామని వారు తమతో అన్నారని వైస్ ఛాన్సలర్ తెలిపారు.