మరికొన్ని గంటల్లో తేలనున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ చేస్తారు. మొత్తం ఓటర్లు 824మంది కాగా, పోలైన ఓట్లు 823గా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 02. రెండు రౌండ్లలో సాగే ఈ కౌంటింగ్ 6 టేబుళ్ళమీద జరుగుతుంది. మొదటి రౌండ్ లో 6 వందల ఓట్లు, రెండో రౌండ్ లో 223 ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో పార్టీకి 8 మంది ఏజెంట్లకు మాత్రమే అనుమతిచ్చారు. లెక్కింపు […]

మరికొన్ని గంటల్లో తేలనున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం
Follow us

|

Updated on: Oct 12, 2020 | 7:18 AM

నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ చేస్తారు. మొత్తం ఓటర్లు 824మంది కాగా, పోలైన ఓట్లు 823గా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 02. రెండు రౌండ్లలో సాగే ఈ కౌంటింగ్ 6 టేబుళ్ళమీద జరుగుతుంది. మొదటి రౌండ్ లో 6 వందల ఓట్లు, రెండో రౌండ్ లో 223 ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో పార్టీకి 8 మంది ఏజెంట్లకు మాత్రమే అనుమతిచ్చారు. లెక్కింపు నుంచి మూడు గంటల్లో అంటే, ఈ ఉదయం 11 గంటల వరకు ఫలితం వెలువడనున్నదని భావిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు అనుగుణంగా ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వుండగా, పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ), సుభాష్ రెడ్డి( కాంగ్రెస్) ఉన్నారు. వీరి భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.