నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు, చిరాగ్ పాశ్వాన్

బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్ళీ  ముఖ్యమంత్రి కాలేరని, కావాలంటే లిఖితపూర్వకంగా రాసి ఇస్తానని ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు, చిరాగ్ పాశ్వాన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 03, 2020 | 12:57 PM

బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్ళీ  ముఖ్యమంత్రి కాలేరని, కావాలంటే లిఖితపూర్వకంగా రాసి ఇస్తానని ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. రాష్ట్ర రెండో దశ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఖగరియా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నితీష్ ఓటమిలో తన పాత్ర ఏమీ లేదని, ప్రజలే ఆయనను తిరస్కరిస్తారని చెప్పారు. బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అన్నదే తన నినాదమన్నారు. నితీష్ ఫ్రీ బీహార్ అని చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు.  ఈ నెల 10 తరువాత ఎవరు సీఎం అన్నది తేలిపోతుందన్నారు.