విదేశాలకు ఎగిరిపోయిన నిత్యానంద..!

వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన గురించి మరిన్ని నిజాలు ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తున్నాయి. నిత్యానందపై మరోసారి క్రిమినల్ కేసు నమోదు కావడంతో.. ఈ సారి ఏకంగా విదేశాలకు ఎగిరిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో​ ఇద్దరి మైనర్ బాలికలను.. కిడ్నాప్ చేసి.. హింసిస్తున్నారని.. నిత్యానందపై బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు.. నిత్యానంద ఆశ్రమానికి వెళ్లి.. బాలికలను విచారించగా.. అసలైన నిజాలు బయటపడ్డాయి. […]

విదేశాలకు ఎగిరిపోయిన నిత్యానంద..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 4:33 PM

వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన గురించి మరిన్ని నిజాలు ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తున్నాయి. నిత్యానందపై మరోసారి క్రిమినల్ కేసు నమోదు కావడంతో.. ఈ సారి ఏకంగా విదేశాలకు ఎగిరిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా.. అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో​ ఇద్దరి మైనర్ బాలికలను.. కిడ్నాప్ చేసి.. హింసిస్తున్నారని.. నిత్యానందపై బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు.. నిత్యానంద ఆశ్రమానికి వెళ్లి.. బాలికలను విచారించగా.. అసలైన నిజాలు బయటపడ్డాయి. వారిని చాలా రోజుల నుంచి అక్కడే నిర్భంధించారని, పని చేయాలని హింసిస్తున్నారని.. బాలికలు వాపోయారు. దీంతో.. నిత్యానందపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతే కాకుండా.. మరోవైపు నిత్యానంద శిష్యులు సాధ్వి ప్రణ్‌ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లు.. చిన్నారులను కిడ్నాప్‌ చేసి, బాల కార్మికులుగా వారితో పనిచేయిస్తున్నారనే ఆరోపణలపై వారిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే.. బెంగుళూరులో కూడా నిత్యానందపై అత్యాచారం కేసు నమోదు కావడంతో.. అతను ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.