డిజిటల్లోకి మరో హీరోయిన్ ఎంట్రీ..
టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నిత్యామీనన్. పాత్ర నచ్చితే చాలు ఎలాంటి సాహసం చేసేందుకైనా నిత్య ముందుంటుంది. కాగా ఇప్పటివరకూ సినిమాలకే పరిమితమైన నిత్యా మీనన్ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ...
టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నిత్యామీనన్. పాత్ర నచ్చితే చాలు ఎలాంటి సాహసం చేసేందుకైనా నిత్య ముందుంటుంది. కాగా ఇప్పటివరకూ సినిమాలకే పరిమితమైన నిత్యా మీనన్ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఇప్పటికే గత కొన్నిరోజుల నుండి నిత్య.. డిజిటల్ ఎంట్రీపై వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. వీటిని నిజం చేస్తూ అభిషేక్ బచ్చన్తో కలిసి ‘బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్లో నటించింది. అమెజాన్ ప్రైమ్లో ఇది రిలీజ్ అయింది. ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ వెబ్ సిరీస్లో అమిత్ సాద్, సయామీఖేర్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే రెండో సిరీస్కు సంబంధించిన ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు అభిషేక్ బచ్చన్. జులై 10న ఈ సీజన్ ప్రారంభం కానుంది. మయాంక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న సీజన్ 1ని సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందించారు.
ఈ సందర్భంగా వెబ్ సిరీస్పై నిత్య స్పందిస్తూ.. ఆనందం వ్యక్తం చేసింది. వెబ్ సిరీస్ ద్వారా అభిమానులకు మరింత దగ్గర అవుతాం. ఇలా అందరినీ పలకరించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుతం నిత్యామీనన్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
Read more: ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. రంగం సిద్ధం