ఆర్థిక మంత్రికి హజ్బెండ్ ఝలక్.. మాంద్యం పై సెన్సేషనల్ కామెంట్స్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్.. ఆర్థిక మాంద్యం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగిపోతోందన్నారు. నాడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లు అనుసరించిన విధానాన్ని పాటిస్తే బాగుంటుందని కేంద్రంపై వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి భర్తే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఆర్ధిక మాంద్యం పై కేంద్రాన్ని విమర్శిస్తూ.. ఆయన హిందూ పత్రికకు రాసిన వ్యాసం ఇప్పుడు దేశవ్యాప్తంగా […]

ఆర్థిక మంత్రికి హజ్బెండ్ ఝలక్.. మాంద్యం పై సెన్సేషనల్ కామెంట్స్
Follow us

| Edited By:

Updated on: Oct 15, 2019 | 12:50 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్.. ఆర్థిక మాంద్యం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగిపోతోందన్నారు. నాడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లు అనుసరించిన విధానాన్ని పాటిస్తే బాగుంటుందని కేంద్రంపై వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి భర్తే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఆర్ధిక మాంద్యం పై కేంద్రాన్ని విమర్శిస్తూ.. ఆయన హిందూ పత్రికకు రాసిన వ్యాసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంశమైంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ సలహాదారుగా పరకాల ప్రభాకర్ బాధ్యతలు నిర్వర్తించారు. పీవీ, మన్మోహన్ పాటించిన ఆర్ధిక విధానాలు నేటికీ సవాలు చేయలేని విధంగా ఉన్నాయని.. కానీ బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించడానికి సిద్ధంగా లేదని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నెహ్రూ హయాంలోని సోషలిజాన్ని విమర్శించే బదులు.. ఆ పాలసీలను పాటించడం మంచిదని చెప్పారు. కేంద్ర నిర్ణయాల వల్ల పలు రంగాలు పడిపోతున్న తీరు.. ఆర్థిక మాంద్యం పెరిగిపోవడానికి అద్దం పడుతోందని ఆయన తన వ్యాసంలో వివరించారు.

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన తప్పిదాలు ఇవే:

1. ప్రస్తుతం దేశం రోజురోజుకీ ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతోంది. 2. ఉత్పత్తి, ఉపాధి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 3. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. 4. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదు. 5. చిన్న పరిశ్రమలు కుదేలయ్యాయి. 6. లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. 7. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కేంద్రం కోతలు పెడుతోంది. 8. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. ఏది కొనాలన్నా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9. ఉపాధి అవకాశాల్ని మెరుగుపరచడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది.

ఇదిలా ఉంటే, కేంద్రమంత్రి నిర్మల్ సీతారామన్‌ కూడా అందుకు తగినట్లే మాట్లాడుతున్నారు. ఓవైపు మాంద్యం ఉందంటూ… ఆందోళన చెందుతూనే… ఆ ప్రభావం సామాన్య ప్రజలపై పడదని చెప్పుకొస్తున్నారు. RBI నుంచీ రూ.1.76లక్షల కోట్లను కేంద్ర ఖజానాకు బదిలీ చేసినా, బ్యాంకుల్ని విలీనం చేస్తున్నా, వడ్డీ రేట్లపై రాయితీలు ప్రకటించినా ఫలితం కనిపించట్లేదని అంటున్నారు.