అమర జవాను తల్లి పాదాలు తాకిన రక్షణ మంత్రి
డెహ్రాడూన్: పుల్వామా దాడిలో అమరుడైన జవాను తల్లి పాదాలను భారత రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ తాకారు. శౌర్య సమ్మాన్ సమరోహ్ పేరుతో డెహ్రాడూన్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులను నిర్మలా సీతారామన్ ఘనంగా సత్కరించారు. స్టైజ్ పైకి వచ్చిన ఒక జవాను తల్లికి పాదాభివందనం చేసిన నిర్మలా సీతారామన్ తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ […]
డెహ్రాడూన్: పుల్వామా దాడిలో అమరుడైన జవాను తల్లి పాదాలను భారత రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ తాకారు. శౌర్య సమ్మాన్ సమరోహ్ పేరుతో డెహ్రాడూన్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులను నిర్మలా సీతారామన్ ఘనంగా సత్కరించారు. స్టైజ్ పైకి వచ్చిన ఒక జవాను తల్లికి పాదాభివందనం చేసిన నిర్మలా సీతారామన్ తన దేశభక్తిని చాటుకున్నారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ విధానాన్ని మోడీ ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. ఇందుకు ఇప్పటికే రూ. 35 వేల కోట్లను విడుదల చేసినట్టు చెప్పారు. బీజెపీది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు.
आज @nsitharaman जी ने देहरादून में एक पूर्व सैनिक सम्मेलन में प्रतिभाग किया । जब उत्तराखंड के अमर शहीद अजीत प्रधान,सेना मेडल सम्मानित,की माँ हेम कुमारी जी उनका स्वागत करने पहुँचीं तो निर्मला जी ने तुरंत आगे बढ़ कर उनके पाँव छुए।
हम सभी पूर्व सैनिकों का सर गर्व से ऊँचा हो गया । pic.twitter.com/Etsg8Rc0ZR
— Ganesh Joshi (@ganeshjoshibjp) March 4, 2019