‘వాళ్ళను ఇదివరకే నాలుగు సార్లు చంపేశారు’..నిర్భయ దోషుల తరఫు లాయర్
నిర్భయ దోషులు నలుగురినీ ఇదివరకే నాలుగు సార్లు చంపేశారని వారి తరఫు లాయర్ ఏ. పీ.సింగ్ పరోక్షంగా కోర్టు మీద, మీడియా మీద అక్కసు వెళ్ళగక్కారు. దోషుల ఉరిశిక్షపై గురువారం పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ..
నిర్భయ దోషులు నలుగురినీ ఇదివరకే నాలుగు సార్లు చంపేశారని వారి తరఫు లాయర్ ఏ. పీ.సింగ్ పరోక్షంగా కోర్టు మీద, మీడియా మీద అక్కసు వెళ్ళగక్కారు. దోషుల ఉరిశిక్షపై గురువారం పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం .. కోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన.. వాళ్ళేమీ టెర్రరిస్టులు కారని అన్నారు. మీడియా ఒత్తిడి ఇప్పటికే వీరిని చంపేసిందని, నాలుగు డెత్ వారెంట్లతో మూడు సార్లు ఉరి తీశారని వ్యంగ్యంగా.. ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను ఈ నెల 20 వ తేదీ తెల్లవారుజామున అయిదున్నర గంటలకు ఉరి తీయాలని కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా డెత్ వారెంట్లు జారీ చేసింది. ఇది ‘జ్యూడిషియల్ కిల్లింగ్’ అని సింగ్ అభివర్ణించారు. తాను నిప్పుతో చెలగాటామాడుతున్నానని కోర్టు అంటోందని, దీని అర్థం తనకు వేధింపులు, బెదిరింపులు వస్తున్నాయన్నదేనని ఆయన అన్నారు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఆయన.. వీరిలో ఒకరికి ఇంకా లీగల్ ఆప్షన్ ఉందని సూత్రప్రాయంగా తెలిపారు.