బ్రేకింగ్: నిర్భయ కేసులో మరో ట్విస్ట్

నిర్భయ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన దోషి పవన్ గుప్తా ఓ పిటిషన్ దాఖలు చేశాడు. అందులో నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని అతడు పేర్కొన్నాడు. తన వయస్సును నిర్ధారించకుండానే ఉరిశిక్షను విధించారని పవన్ గుప్తా చెప్పుకొచ్చాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. కాగా ఈ కేసులో తనకు ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దోషి అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు […]

బ్రేకింగ్: నిర్భయ కేసులో మరో ట్విస్ట్
Follow us

| Edited By:

Updated on: Dec 18, 2019 | 8:51 PM

నిర్భయ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన దోషి పవన్ గుప్తా ఓ పిటిషన్ దాఖలు చేశాడు. అందులో నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని అతడు పేర్కొన్నాడు. తన వయస్సును నిర్ధారించకుండానే ఉరిశిక్షను విధించారని పవన్ గుప్తా చెప్పుకొచ్చాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.

కాగా ఈ కేసులో తనకు ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దోషి అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. నలుగురు దోషులకు ఉరిశిక్ష వేయడమే కరెక్ట్ అని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మానవత్వం మంట గలిపే రీతిలో నలుగురు నిందితులు దారుణానికి ఒడిగట్టారని.. వారు క్షమించడానికి కూడా అర్హులు కారు అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంలో స్పష్టం చేశారు. ఇక అక్షయ్ సింగ్ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసి కొన్ని గంటలు కూడా అవ్వకముందే.. మరో దోషి పవన్ గుప్తా తన వయస్సుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం గమనర్హం.