కశ్మీర్ బీజేపీ నేతల హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ నేతల హత్య కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అనిల్ పరిహర, అతని సోదరుడు అజిత్ పరిహరలను హత్యచేసిన కేసులో.. హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఉగ్రవాది జహంగీర్ నిందితుడుగా ఉన్నాడు. జహంగీర్తో పాటుగా మరో ఏడుగురికి కూడా ఈ హత్యతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ జహంగీర్ సరూరీతో పాటుగా మరో ఏడుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్ […]
జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ నేతల హత్య కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అనిల్ పరిహర, అతని సోదరుడు అజిత్ పరిహరలను హత్యచేసిన కేసులో.. హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఉగ్రవాది జహంగీర్ నిందితుడుగా ఉన్నాడు. జహంగీర్తో పాటుగా మరో ఏడుగురికి కూడా ఈ హత్యతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ జహంగీర్ సరూరీతో పాటుగా మరో ఏడుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్ షీటు దాఖలుచేసింది.
2018లో రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేతలైన అనిల్, అజిత్లు రాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా.. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చారు. అయితే ఈ దాడిలో దాదాపు ఎనిమిది మంది పాల్గొన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో హిజ్బుల్ ఉగ్రవాదులు ఒసామాబిన్ జావీద్, హారూన్ అబ్బాస్ వనీలు పరారీలో ఉన్నారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల్ని గతేడాది నవంబర్లో అరెస్ట్ చేశారు. వీరితో పాటుగా మరో ముగ్గురు ఉగ్రవాదులకు వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.