ఐసీస్ కలకలం..తమిళనాడులో NIA రైడ్స్..

దేశంలో మరోసారి ఐసీస్ అడుగుజాడలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో మరోసారి ఎన్ఐఏ తనిఖీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు తనిఖీలు చేసిన NIA.. సోమవారం మరోసారి సోదాలు నిర్వహించాయి. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. శివారు ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో ఐసిస్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తూత్తుకుడి, కవడలూరులతో పాటు.. మొత్తం 20 ప్రాంతాల్లో రైడ్స్ చేపట్టగా.. అటు […]

ఐసీస్ కలకలం..తమిళనాడులో NIA రైడ్స్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 25, 2020 | 6:48 AM

దేశంలో మరోసారి ఐసీస్ అడుగుజాడలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో మరోసారి ఎన్ఐఏ తనిఖీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు తనిఖీలు చేసిన NIA.. సోమవారం మరోసారి సోదాలు నిర్వహించాయి. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. శివారు ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో ఐసిస్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.

తూత్తుకుడి, కవడలూరులతో పాటు.. మొత్తం 20 ప్రాంతాల్లో రైడ్స్ చేపట్టగా.. అటు కర్ణాటకలో కూడా ఓ ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు ఎన్ఐఏ అధికారులు. కాగా.. పోలీసు అధికారి విల్సన్‌ హత్యకేసులో విచారణలో భాగంగా ఈ రైడ్స్‌ చేపట్టామని అధికారులు తెలిపారు. పోలీసు బృందాలు ప్రతి ఒక్కరి పత్రాలను పరిశీలించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.