మహారాష్ట్రకు 5 రోజులు అత్యంత కీలకం.. ఎందుకంటే ?
మహారాష్ట్రకు.. ముఖ్యంగా ముంబై నగరానికి రాబోయే అయిదు రోజులూ అత్యంత కీలకం కానున్నాయి. గత రెండు రోజుల్లో ఈ నగరంలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడమే ఇందుకు కారణం.
మహారాష్ట్రకు.. ముఖ్యంగా ముంబై నగరానికి రాబోయే అయిదు రోజులూ అత్యంత కీలకం కానున్నాయి. గత రెండు రోజుల్లో ఈ నగరంలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడమే ఇందుకు కారణం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రం.. ప్రధానంగా ఈ నగరం మరో న్యూయార్క్ సిటీగా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. రాష్ట్రంలో ఇంచుమించు ప్రతిరోజూ వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడం కనీవినీ ఎరుగనిదని ప్రభుత్వ, ఆరోగ్య శాఖ అధికారులు, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా అంటోంది. అయితే వచ్ఛే వారం ఈ కేసుల సంఖ్య తగ్గవచ్ఛునని కూడా ఆశిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కానీ వారే… వచ్ఛే అయిదారు రోజుల్లో ముంబైలో 200 నుంచి 300 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, కానీ మరో 10 రోజుల్లో ఇవి ఇంకా పెరుగుతూ పోతే ఈ సిటీ లేదా ఈ రాష్ట్రం మరో ఇటలీ లేక న్యూయార్క్ సిటీగా మారవచ్ఛునని కూడా ఒక అధికారి వ్యాఖ్యానించారు. రెండు వారాల క్రితం వరకు కూడా ముంబైలో అతి తక్కువ కేసులు బయటపడ్డాయి. కానీ ఇటీవలి కాలంలో ఇవి హఠాత్తుగా పెరిగాయి అని ఆయన అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజూ 1500 కరోనా టెస్టులు నిర్వహిస్తోంది.