రానున్న మూడు నెలలు కీలకం: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
ప్రస్తుత పండుగల సమయాలతో పాటు, శీతాకాలంలో ప్రజలంతా కరోనా సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు.
ప్రస్తుత పండుగల సమయాలతో పాటు, శీతాకాలంలో ప్రజలంతా కరోనా సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఒకప్పుడు రోజుకు 95వేల కేసులు నమోదయ్యేవని… ఇప్పుడు వాటి సంఖ్య 55వేలకే పరిమితమైందని వివరించారు. రికవరీ రేటు 90శాతానికి దగ్గరలో ఉందన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తే కరోనాపై పోరులో ఇండియా మెరుగైన స్థితిలో ఉంటుందని చెప్పారు. కొవిడ్ సన్నద్ధతపై ఆరోగ్య, వైద్యవిద్య శాఖల మంత్రులతో ఇవాళ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. భారత్లో కరోనా స్థితిగతులను మార్చేందుకు వచ్చే మూడు నెలలు చాలా కీలకమని చెప్పారు. ఉత్తర్ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం వల్లే.. వైరస్ను కట్టడి చేయగలిగినట్లు హర్షవర్ధన్ పేర్కొన్నారు. గడిచిన మూడు నెలల్లో దేశంలో కొవిడ్ ప్రభావం తగ్గినట్లు తెలిపారు. దేశంలో కొవిడ్ మరణాలు రేటు 1.51శాతంగా ఉందని… దీన్ని ఒక్క శాతంలోపునకు తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Also Read :
Breaking : మళ్లీ గ్రే జాబితాలోనే పాకిస్థాన్ !